బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న నల్లాల దంపతులు
మందమర్రి ప్రతి నిధి,అర్జున్ సమాచారం ఆగస్టు 11.
ఆషాఢ మాస బోనాల సందర్భంగా మందమర్రి పట్టణంలోని సిఎస్పి రోడ్డు అమ్మ వారి ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు పాల్గొని, భోనమెత్తిన మాజీ ప్రభుత్వ విప్ & చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు - భాగ్యలక్ష్మి ( మాజీ జెడ్పి ఛైర్ పర్సన్ ) దంపతులు .ముందుగా పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భోనాల జాతరను ప్రారంభించారు ఆలయ కమిటీ సభ్యులు ఓదన్న దంపతులకు సాదరంగా తెలుపగా, స్థానిక ప్రజలు ఓదన్న మీద తమ అభిమానాన్ని చాటుకుంటూ ఆప్యాయంగా పలకరించి, తమ కేరింతలతో వెంకటేశ్వర ఆలయం నుంచి సిఎస్పి అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా భోనాల ఉత్సవాల్లో నృత్యాలు చేస్తూ, ఉత్సాహంగా పాల్గొన్నారు అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, సారె, ఓడి బియ్యం, పట్టు వస్త్రాలు సమర్పించి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

