ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeజాతియం53 325 పాయింట్లు పడిన సెన్సెక్స్‌

53 325 పాయింట్లు పడిన సెన్సెక్స్‌

📰 Generate e-Paper Clip

 ముంబై, ఆగస్టు 19,అర్జున్ సమాచారం:
దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగింది. గ్లోబల్‌ మార్కెట్లలో బలహీన పరిస్థితుల ప్రభావంతో బుధవారం బెంచ్‌మార్క్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ వరుసగా ఏడో సెషన్‌లో పతనమైంది. సెన్సెక్స్‌ వరుసగా నాలుగో రోజు నష్టపోయింది.బుధవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి నిఫ్టీ 76.60 పాయింట్లు నష్టపోయి 24,078.30 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 325.78 పాయింట్లు తగ్గి 76,909.68 వద్ద ముగిసింది. సెప్టెంబరు 2025 తర్వాత నిఫ్టీకి ఇదే అత్యంత సుదీర్ఘ నష్టాల పరంపర.నిఫ్టీ ప్రస్తుతం కీలకమైన 24,000 స్థాయికి చేరువలో ఉంది. 24,050 దిగువన ముగిస్తే తదుపరి సెషన్‌లో 24,000 స్థాయిని పరీక్షించే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు 24,200-24,300 శ్రేణి తక్షణ నిరోధంగా మారొచ్చని అంచనా వేస్తున్నారు.నిఫ్టీలో మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌, కోల్‌ ఇండియా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ 0.21 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 0.51 శాతం పడిపోయాయి.రంగాల వారీగా మిశ్రమ పరిస్థితి కనిపించింది. నిఫ్టీ కెమికల్స్‌ సూచీ అత్యధికంగా నష్టపోయింది. ఐటీ సూచీ మాత్రం ఇతర రంగాల కంటే మెరుగ్గా రాణించింది. సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎటర్నల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, సన్‌ ఫార్మా, టైటన్‌ షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు నష్టపోయాయి.
=================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!