ePaper
Saturday, August 22, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్చంపాపేట్లో అమ్మవారి గుడిలో విగ్రహం మాయం హైదరాబాద్

చంపాపేట్లో అమ్మవారి గుడిలో విగ్రహం మాయం హైదరాబాద్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
చంపాపేట్లోని కటికొనుకుంట ప్రాంతంలో అమ్మవారి ఆలయంలో విగ్రహం మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం కనిపించకపోవడంతో ఆలయ నిర్వాహకులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.  విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. విగ్రహం ఎలా మాయమైంది? ఎవరైనా అపహరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఆలయం పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!