ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్హత్య కేసులో నిందితుడి అరెస్ట్

హత్య కేసులో నిందితుడి అరెస్ట్

📰 Generate e-Paper Clip

హుజురాబాద్ టౌన్, జూలై 13,అర్జున్ సమాచారం:

హుజూరాబాద్ లోని మామిండ్లవాడకు చెందిన చింత సునీత(35) హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు హుజూరాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి సోమవారం తెలిపారు. హత్య జరిగిన కేవలం 36 గంటల్లోనే ఈ కేసును చేయించినట్లు వివరించారు. సోమవారం హుజూరాబాద్ పోలీసు స్టేషన్ లో హత్య కేసు వివరాలను ఆమె వెల్లడించారు. హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చింత సునీత (35) గత కొంతకాలంగా హుజూరాబాద్ మామిండ్లవాడలో నివాసం ఉంటుంది. ఆమె భర్త కుమార్ మృతి చెందగా, గత ఐదు సంవత్సరాలుగా మోతే కిరణ్ తో సహజీవనం చేస్తుంది. వీరిద్దరు మామిండ్లవాడ గ్యాస్ గోదాం సమీపంలో ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. సునీత తన పక్కన ఉన్న ఇంట్లో ముతోజు భాగ్య అనే మహిళతో స్నేహం పెంచుకుందన్నారు. తరచూ వీరిద్దరు కలిసి తిరుగుతుండటంతో సునీత వ్యభిచారం చేస్తుందనే అనుమానం కిరణ్ కలిగిందన్నారు. ఈ అనుమానంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవన్నారు. ఈ నెల 10న కిరణ్, సునీత ఇద్దరు కలిసి మద్యం సేవింవారన్నారు. ఇదే విషయమై మళ్లి గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన కిరణ్ ముందుగా సునీత గొంతును చేతులతో పిసికి, అనంతరం చిర ముక్కతో గొంతు బిగించి, కాలితో మెడపై తొక్కి హత్య చేశాడన్నారు. ఎవరికి తనపై అనుమానం రాకుండా ఉండేందుకు సునీత మృతదేహాన్ని ఎత్తుకొని వెళ్లి తన స్నేహితురాలైన ముతోజు భాగ్య ఇంటి సమీపంలోని బావిలో పడేశాడన్నారు. సునీత ధరించిన లో దుస్తులు (ప్యాంట్, డ్రాయర్) ను బావికి సమీపంలోని చెట్టు వద్ద పడవేసి, అక్కడి నుంచి పరారై కరీంనగరకు వెళ్లిపోయాడని పేర్కొన్నారు. సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 13న సోమవారం హుజూరాబాద్ కు తిరిగి వచ్చాడనే పక్కా సమాచారం అందటంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, స్వచ్ఛందంగా నేరాన్ని ఒప్పుకున్నాడన్నారు.  సంఘటన జరిగిన ఇంటిని, మృతదేహాన్ని పడవేసిన బావిని, దుస్తులు పడవేసిన స్థలాన్ని చూపించాడన్నారు. సంఘటన స్థలం నుంచి పగిలిన గాజులు, గాజు ముక్కలు, పుస్తెల పూసలు, కాలి పట్టి తదితర కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే బావి సమీపంలో పడవేసిన మృతురాలి లో దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కేసు దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. మహిళ హత్య కేసును కేవలం 36 గంటల్లోనే ఛేదించి నిందితుడిని పట్టుకున్నామన్నారు. సిఐ కరుణాకర్, ఎస్ఐ లు రవి, శ్రీనివాసరావు, సిబ్బంది మోహన్, అవినాష్, మహేందర్, శ్రీధర్, అనిల్ లను ఏసిపి అభినందించారు.
===============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!