హైదరాబాద్,అర్జున్ సమాచారం:
తెలంగాణ రాష్ట్రం లో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో ఫీజుల నియంత్రించాలని ఆప్ నేతలు డిమాండ్ చేసారు. సోమవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. , ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని , విద్యా శాఖకు మంత్రిని కేటాయించాలని , వివిధ విద్యారంగ సమస్యల ను పరిష్కరించాలని అందళనకారులు డిమాండ్ చేసారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాష్ట్ర కార్యవర్గ నాయకులు అందరూ ముఖ్యమంత్రి నివాసం దగ్గరికి చేరుకోగా కాసేపు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP ) నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి మధురానగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు
=======================

