కరీంనగర్,అర్జున్ సమాచారం:
సర్ అనేది రాజకీయ కార్యక్రమం కాదు ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమం
ప్రజాస్వామ్యంలో ఓటే బలమైన ఆయుధం.
ఓటే లేకపోతే మీ ప్రశ్నకు ప్రజాస్వామ్య బలం ఎక్కడిది
ఆ ఏముందిలే అని నిర్లక్ష్యం చేస్తే ఓటును కోల్పోతారు.
యువకులారా సర్ ప్రక్రియలో పాల్గొనండి.
మీ కుటుంబ సభ్యుల ఓట్లు పోకుండా చూడండి. బీఎల్ఓ వద్దకు వెళ్లి ఫారమ్ ను అందజేసిన కేంద్ర మంత్రి.
సర్ ప్రకియ పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్.
కరీంనగర్ లో బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా తప్పనిసరిగా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ సర్ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. సర్ ను లైట్ తీసుకుంటే మీ ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉంది అని హెచ్చరించారు. సర్ ప్రక్రియను ఎవరూ లైట్ తీసుకోవద్దని కోరారు. మీ ఓటును కాపాడుకోండి మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి’అని పిలుపునిచ్చారు.

