ePaper
Thursday, September 17, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన...

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ భేటీ

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన సింగపూర్ ప్రతినిధులు.

మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్స్ సిటీ అభివృద్ధి అంశాలను సింగపూర్ ప్రతినిధులకు వివరించిన సిఎం.
తొలిదశలో మూసా, ఈసా నదుల సంగమం గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవనం చేపట్టనున్నట్లు వివరించిన సీఎం.
రివర్ ఫ్రంట్ అభివృద్ధితో పాటు, నైట్ ఎకానమీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించిన ముఖ్యమంత్రి.
హైదరాబాద్ ను పర్యాటకంగానే కాకుండా నాలెడ్జ్ హబ్ గా తీర్చి దిద్దుతున్నామన్న సీఎం
ఇప్పటికే హార్వార్డ్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీల, ఎంఎల్ టి, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తమ ఆఫ్ షోర్ క్యాంపస్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించారని తెలిపిన సీఎం.
భారత్ ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పిన సీఎం
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి ఆర్ధిక పరమైన సహకారం అందించాలని కోరిన సీఎం.
రాష్ట్రంలో పెట్టుబడులకు అన్నిరకాలుగా ప్రభుత్వం సహకరిస్తుందన్న సీఎం
పెట్టుబడులపై సానుకూలంగా స్పందించిన సింగపూర్ ప్రతినిధులు.. ఈ సందర్భంగా సింగపూర్ ప్రతినిధులను ఫ్యూచర్ సిటీలో డిసెంబరులో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించిన ముఖ్యమంత్రి.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, కాన్సుల్-జనరల్ విలియం చిక్, ఇతర సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
=================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!