ePaper
Thursday, September 17, 2026
ePaper
Homeతెలంగాణపింఛను దరఖాస్తుల పరిశీలనకు ఆకస్మిక తనిఖీ.రామారావుపేట, టేకుమట్ల గ్రామాల్లో ఎంపీడీవో శ్రీపతి బాపురావు పర్యటన

పింఛను దరఖాస్తుల పరిశీలనకు ఆకస్మిక తనిఖీ.రామారావుపేట, టేకుమట్ల గ్రామాల్లో ఎంపీడీవో శ్రీపతి బాపురావు పర్యటన

📰 Generate e-Paper Clip

పింఛను దరఖాస్తుల పరిశీలనకు ఆకస్మిక తనిఖీ.రామారావుపేట, టేకుమట్ల గ్రామాల్లో ఎంపీడీవో శ్రీపతి బాపురావు పర్యటన.

అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 16. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

జైపూర్:రామారావుపేట: పింఛను కోసం వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించేందుకు రామారావుపేట, టేకుమట్ల గ్రామ పంచాయతీల్లో ఎంపీడీవో శ్రీపతి బాపురావు బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హతలను ధ్రువీకరించారు.
అదేవిధంగా గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలను నిబంధనల ప్రకారం వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ పర్యటనలో ఏవో సైదా, గృహ నిర్మాణ శాఖ సహాయ ఇంజినీర్ కాంక్ష, సర్పంచ్ పులి రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శులు డి.రజిత, టి.శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!