ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్పోలీసు శాఖలో కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై శిక్షణ పీటీసీలో కార్యక్రమాన్ని...

పోలీసు శాఖలో కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై శిక్షణ పీటీసీలో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ గౌష్ ఆలం

📰 Generate e-Paper Clip

కరీంనగర్,అర్జున్ సమాచారం:
ఆధునిక సాంకేతికతతో నేర నియంత్రణ, దర్యాప్తులో మరింత సామర్థ్యం పెంపే లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పిటిసి  కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు శాఖ కూడా అదే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కృత్రిమ మేధస్సు ఏI డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, స్మార్ట్ సర్వైలెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేరాల నియంత్రణ, దర్యాప్తు, ప్రజా భద్రతలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2018, 2020 మరియు 2024 బ్యాచ్‌లకు చెందిన కానిస్టేబుళ్లకు ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నిర్వహిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో మూడు కమిషనరేట్లు నిజామాబాదు,కరీంనగర్, సిద్దిపేట ఆరు జిల్లాలకు ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, ఆసిఫాబాద్ చెందిన పోలీసు సిబ్బందికి మొత్తం 11 దశల్లో శిక్షణ అందించనున్నట్లు చెప్పారు. ప్రతి దశలో 80 మంది కానిస్టేబుళ్లు పాల్గొంటారని, ప్రతి బ్యాచ్‌కు ఐదు రోజుల పాటు శిక్షణ నిర్వహించనున్నట్లు వివరించారు.
శిక్షణలో భాగంగా ఏI ఆధారిత పోలీసింగ్, డిజిటల్ సాక్ష్యాల నిర్వహణ, సైబర్ నేరాల గుర్తింపు మరియు నివారణ, స్మార్ట్ సర్వైలెన్స్ వ్యవస్థలు, దర్యాప్తులో సాంకేతిక వినియోగం, డేటా విశ్లేషణ, నైతిక విలువలు, గోప్యతా నిబంధనలు, చట్టపరమైన అంశాలపై నిపుణులచే ప్రాయోగిక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.
పోలీసు సిబ్బంది సాంకేతికంగా మరింత నైపుణ్యం సాధించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించే విధంగా ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని సీపీ గౌష్ ఆలం పేర్కొన్నారు. తెలంగాణ పోలీసు శాఖను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సాంకేతికంగా మరింత బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపల్ అడిషనల్ ఎస్పీ ఎం. పిచ్చయ్య, వైస్ ప్రిన్సిపల్ ఏసీపీ గంగాధర్, ఏసీపీ లు విజయపాల్ రెడ్డి, బి. నారాయణ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
============================

Previous article
Next article
విద్యారంగాన్ని ధ్వంసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ సీఎం రేవంత్ రెడ్డిది ‘డైవర్షన్ పాలిటిక్స్’.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని హామీలపై జెన్-జీ (Gen-Z) ప్రశ్నిస్తుందనే భయంతోనే 21 ఏళ్ల వయస్సు అంశంపై సీఎం ‘డైవర్షన్ పాలిటిక్స్’. ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.12 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలి. యువతపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని, రాష్ట్ర విద్యాశాఖను యువకులకు అప్పగించాలి. మాజీ రాష్ట్రపతి డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. జేఎన్‌టీయూ పరిశోధనాత్మక గ్రంథం ‘శ్రీమన్ భగవద్గీత’ పుస్తకం ఆవిష్కరణ.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!