మండల అభివృద్ధి అధికారిగా అదనపు బాధ్యతలు చేపట్టిన శ్రీపతి బాపురావుకు ఘన సన్మానం
అర్జున్ సమాచారం జులై 03 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:
మంచిర్యాల జిల్లా: జైపూర్ మండలం: జైపూర్ మండల అభివృద్ధి అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన శ్రీపతి బాపురావును ఇందారం గ్రామ సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్ సోమవారం శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
మండల అభివృద్ధి కోసం సమన్వయంతో సేవలు అందించి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బేధ లాస్య ప్రసాద్, నామాల సాయి, యువ నాయకుడు చిప్పకుర్తి సతీష్ పాల్గొన్నారు.

