ePaper
Saturday, September 12, 2026
ePaper
Homeతెలంగాణవిద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ.విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది: సర్పంచ్ జాడి లక్ష్మి.

విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ.విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది: సర్పంచ్ జాడి లక్ష్మి.

📰 Generate e-Paper Clip

విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ.విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది: సర్పంచ్ జాడి లక్ష్మి.

అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 12. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

జైపూర్ మండలం, దుబ్బపల్లి:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా దుబ్బపల్లి ఉన్నత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఒకే విధమైన పాఠశాల దుస్తులను అందజేశారు.
ఈ కార్యక్రమానికి వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ జాడి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఏకరూప దుస్తులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు. విద్యార్థులలో సమానత్వ భావన పెంపొందించడంతో పాటు పాఠశాల వాతావరణంలో క్రమశిక్షణకు ఏకరూప దుస్తులు దోహదపడతాయని తెలిపారు.
సర్పంచ్ జాడి లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి తగినంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విద్యార్థులకు అవసరమైన పలు సౌకర్యాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయురాలు శ్యామల, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు ఏకరూప దుస్తులను అందుకోవడంతో సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!